మరో తెలుగు సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న షాహిద్ కపూర్..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా మంచి విజయాన్ని సాధించినట్లు అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి హిందీ హీరోలు, దర్శక నిర్మాతలు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు, అందులో భాగంగా ఇదివరకు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు టాలీవుడ్ లో విజయాలు సాధించిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి విజయాలను సాధించారు,  ప్రస్తుతం టాలీవుడ్ లో విజయాలు సాధించిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న హీరోలలో షాహిద్ కపూర్ ఒకరు.  షాహిద్ కపూర్ ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్  బాక్స్ ఆఫీస్ దగ్గర  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, కబీర్ సింగ్ సినిమాకు కూడా తెలుగు అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు.

  షాహిద్ కపూర్ ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయం సాధించి ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందిన జెర్సీ సినిమాలు హిందీలో రీమేక్ చేస్తున్నాడు,  జెర్సీ హిందీ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇలా ఇప్పటికే ఒక టాలీవుడ్ సినిమాను హిందీలో రీమేక్ చేసి మంచి విజయం అందుకున్న షాహిద్ కపూర్ ప్రస్తుతం మరో తెలుగు రీమేక్ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది,  నాని హీరోగా తెరకెక్కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన శ్యామ్ సింగరాయ్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే  ఆలోచనలు షాహిద్ కపూర్ సాహిత్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: