ఇప్పుడు పూరీకి డిమాండ్ పెరుగుతుందేమో..?
కొంతకాలంగా ఫేడ్ అవుట్ అయి పూరి ఆమధ్య హీరో రామ్తో ఇస్మార్ట్ శంకర్ మూవీతో మళ్లీ హిట్ కొట్టినా ఆతరువాత ఆ తరువాత కోవిడ్ కారణంగా సైలెంట్గానే ఉండిపోవాల్సి వచ్చింది. గత ఏడాది అక్టోబర్లో పూరీ తనయుడు ఆకాశ్ హీరోగా వచ్చిన రొమాంటిక్ చిత్రానికి నిర్మాతల్లో ఒకరిగా వ్యవహ రించాడు. ఇక కోవిడ్ కారణంగా మరోసారి థియేటర్లు మూతపడే అవకాశం పెరుగుతుండటంతో ఓటీటీని నమ్ముకోక తప్పని పరిస్థితి. అయితే ఆ వేదిక మీద రిలీజ్ చేయగలగాలంటే సినిమా బడ్జెట్ తక్కువలో అయిపోవాలి. అంతేకాదు. తక్కువ రోజుల్లో సినిమా తీయగలగాలి కూడా. అదే సమయంలో పెద్ద హీరోలను డైరెక్ట్ చేయగల స్టేచర్ ఉండాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే డైరెక్టర్గా పూరీ మరోసారి వెలుగులోకి వచ్చే దండిగానే ఉన్నాయని చెప్పాలి. ఉండాలి. తక్కువ టైమ్లో పూర్తి చేస్తే పెద్ద హీరోలు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకుని సినిమాలు చేసే అవకాశముంది. స్టార్ హీరోల సినిమాలకూ ఓటీటీలో ఆదరణ ఎలాగూ బాగానే ఉంటుంది. మరి ఈ దిశగా ప్రయత్నాలు ఏమేరకు ముందుకు సాగుతాయో చూడాలి.