
వైరల్ అవుతున్న సమంత ట్వీట్...!
ఉన్నట్టు ఉండి సమంత ఈ సందేశాన్ని అస్సలు ఎందుకు పోస్ట్ చేసింది అంటే కొత్త ఏడాది కదా. అందుకే, కాస్త కొత్తగా ఆలోచించి మొత్తానికి ఈ కొత్త మెసేజ్ ను పోస్ట్ చేసిందట.. ఏది ఏమైనా 2021 సంవత్సరం సమంతకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం.
నాగచైతన్యతో విడాకుల వ్యవహారం అలాగే సమంత ఎఫైర్లు అంటూ వచ్చిన పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయట పడుతుందట.ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే మరి. ప్రస్తుత విషయానికి వస్తే.. రానున్న 2022 కొత్త ఏడాదికి సమంత గ్రాండ్ స్వాగతం చెప్పాలని డిసైడ్ అయిందట.
అందుకే, పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోవాలని డిసైడ్ అయిందట.. ఈ నేపథ్యంలో బాధలన్నిటినీ మర్చిపోయి మరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేయాలి కదా కనుక వదిలేసింది ఊరికినే వదిలేస్తే అస్సలు ఏం బాగుంటుంది అందుకే, తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక ఎమోషనల్ మెసేజ్ ను షేర్ చేసిందని తెలుస్తుంది.
తన పెంపుడు కుక్కల ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఈ విధంగా మెసేజ్ చేసిందట.ఈ 2022లో ఎంతో బలంగా, ఎంతో తెలివిగా అలాగే దయగల వ్యక్తిగా ఉంటానని, తనతోపాటే అందరూ అలాంటి లక్షణాలు అలవరచుకోవాలని మెసేజ్ చేసిందట.. అలాగే మీ అతి పెద్ద లక్ష్యం దూరంగా కనిపిస్తే సాధారణ జీవితాన్ని కూడా సంతోషంగా మరియు పండగలా గడపండి, అన్ని విజయాలు వరిస్తాయి' అంటూ సమంత మెసేజ్ పోస్ట్ చేసిందట.సమంత ప్రస్తుతం భారీ సినిమాలలో మంచి పాత్రలని అలాగే కొన్ని బోల్డ్ పాత్రలను ఎంచుకుంటుంది.