దేశంలో “ఒమిక్రాన్” వేరియంట్ కేసులు పెరగడం, “కోవిడ్-19” కేసులు సంఖ్య కూడా రోజురోజుకు అధికసంఖ్యలో నమోదు కావడంతో దేశ రాజధాని ఢిల్లీ లో మరోసారి ఆంక్షలు విధించారు సిఎం కేజ్రీవాల్. “ఒమిక్రాన్“ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తో మార్కెట్లన్నీ వెలవెల పోతున్నాయని సంచారం అందుతోంది. మార్కెట్ ప్రాంతంలో దుకాణాలను “ఆడ్, ఈవెన్” పధ్దతిలో తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు సిఎం కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన “ఎల్లో అలర్ట్“ మరి కొంతకాలం కొనసాగవచ్చని మనకు సంచారం అందుతోంది. “కొవిడ్“ పాజిటివిటీ రేటు 0.5 శాతం దాటితే “ఎల్లో అలర్ట్” జారీ చేశారు సిఎం కేజ్రీవాల్. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.68 శాతం నమోదు. ఢిల్లీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు లోకి తీసుకు వచ్చారు సిఎం కేజ్రీవాల్..
ధియేటర్ల ను మూసివేయడంతో విపరీతమైన రద్దీ గా ఉండే ప్రాంగణాలన్నీ బోసిపోయాయని తెలుస్తోంది. గతంలో సుమారు 20 నెలల పాటు ధియోటర్లను మూసివేశారు. సుమారు ఓ నెల క్రితమే ధియేటర్లను తిరిగి అనుమతించారని... అంతలోనే, మరలా ఆంక్షలు విధించడంతో ధియోటర్లను మూసివేశారని మనకు అర్థం అవుతుంది. స్పా, జిమ్లను కూడా మూసివేసింది కేజ్రీవాల్ సర్కార్. 50 శాతం సామర్థ్యంతో మెట్రో, బార్లు, ప్రైవేటు ఆఫీసులకు అనుమతించారు సిఎం కేజ్రీవాల్.. ప్రార్ధన మందిరాలకు భక్తులకు అనుమతి నిరాకరించారు సిఎం కేజ్రీవాల్.
“సరి-బేసి” సంఖ్య విధానంలో మాల్స్ కు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతించారు సిఎం కేజ్రీవాల్. పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఢిల్లీలో 50శాతం సామర్థ్యంతోనే బస్సుల రవాణాకు అనుమతించారు సిఎం కేజ్రీవాల్.. ఆటోలు, ట్యాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉందని... వేడుకలు, వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మించి ఉండకూడదని అంక్షలు విధించారు సిఎం కేజ్రీవాల్.. గత అనుభవం రీత్యా, ఢిల్లీ వాసులు కూడా పెద్దగా బయటకు వచ్చేందుకు నికరిస్తున్నారు.