పుష్ప రాజ్ డిలేటెడ్ సీన్ : అనవవసరం అంటున్న నెటిజన్స్..

frame పుష్ప రాజ్ డిలేటెడ్ సీన్ : అనవవసరం అంటున్న నెటిజన్స్..

Purushottham Vinay
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారి అంచెలంచెలుగా ఎదుగుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే రాబట్టుకున్నాడు.ఇక ఈ సినిమా సినిమా అయితే టాక్ తో ఎలాంటి సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టిన పెట్టుబడికి ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది.ఇక మరో పది కోట్ల వరకు షేర్ వసూళ్లను అందుకుని లాభాల్లోకి వచ్చినట్లు లెక్క తెలుస్తుంది. ముఖ్యంగా హిందీ భాషలో సినిమా కేజిఎఫ్ 1 రికార్డును కూడా బ్రేక్ చేసింది. మొత్తంగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ సినిమాల్లో పుష్ప సినిమా 5వ స్థానం దక్కించుకుంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక డిలిటెడ్ సీన్ని కూడా యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది.పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని డైరెక్టర్ సుకుమార్ మొదటి భాగంలోనే దాదాపు గంటకుపైగా సీన్లను వృధాగా షూట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఖర్చు పరంగా 30 కోట్ల వరకు అనవసరమైన సన్నివేశాలు చేశారని సమాచారం తెలుస్తుంది.

ఇక మొదటి భాగంలో ఒక సీన్ బాగానే ఉన్నప్పటికీ అనవసరమని ఆ సన్నివేశాన్ని తీసేయడం జరిగింది. గొడ్డు మాట వినదు ఇంకా కొడుకు మాట వినడు అనే డైలాగ్ ఆధారంగా ఆ సీన్ న్ని హైలైట్ చేసినట్లు కనిపిస్తోంది.ఇక తీసుకున్న వ్యక్తి పరువు పోయేలా అప్పుని అడగడంతో గొడ్డును అమ్మేస పుష్పరాజ్ ఆ అప్పు తీర్చేస్తాడు. ఇక ఆ తర్వాత అతనికి వడ్డీతో సహా అన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ పరువు కూడా మళ్ళీ తిరిగి రావాలని అంటాడు. అందరి ముందు నా పరువుని తీశారు కాబట్టి ప్రతి ఒక్కరికీ మేము మళ్ళీ నీకు డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పాలి అని అతన్ని కొట్టుకుంటూ ప్రతీ ఇంటికి కూడా తీసుకు వెళతాడు. ఇక ఈ సీన్ అయితే ఒక విధంగా బాగానే ఉన్నప్పటికీ సినిమాకు అవసరం లేదు అని చెప్పాలి.నెటిజన్స్ కూడా ఈ సీన్ చూసి అనవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇప్పటికే మూడు గంటల వరకు సినిమా చాలా ఎక్కువ నిడివిలో ఉంది అనే విమర్శలు కూడా ఆడియన్స్ నుంచి చాలా వచ్చాయి. కానీ దర్శకుడు సుకుమార్ ఆ సమయంలో కూడా సినిమాను ఇంకా తాను అనుకున్నంతగా ప్రజెంట్ చేయలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: