పుష్ప : థియేటర్ యాజమాన్యంలో భయం భయం?

praveen
దక్షిణాది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. ఆంధ్రాలో ఎలాంటి అనుమతి లేకపోవడంతో తెలంగాణాలో ఉదయం నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. పుష్ప రాజ్ రేపు అందరిని ఆకట్టుకోబోతున్నాడు.  భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి.  ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డు సృష్టించబోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.


ఇకపోతే పుష్ప సినిమా విడుదల నేపథ్యంలో ప్రస్తుతం అభిమానులందరూ భారీగా సినిమా థియేటర్లకు తరలి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఎన్నో రోజులనుంచి సినిమా థియేటర్ కు దూరమైన ప్రేక్షకులు సైతం పుష్ప సినిమా కోసం థియేటర్లకు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఇక పుష్ప బజ్ చూసుకుంటే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో మరో హిట్ ఖాయం అన్నట్లుగానే కనిపిస్తోంది. అయితే పుష్ప సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలు మాత్రం కాస్త భయం భయం గానే ఉన్నాయి.


 అదేంటి పెద్ద సినిమా విడుదలైతే థియేటర్ యాజమాన్యం సంతోషించాలి కానీ భయం ఎందుకు అని అంటారా పెద్ద సినిమా విడుదల అవుతుంది అన్న సంతోషం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు పెద్ద సినిమా విడుదల సమయం లో భారీగా ప్రేక్షకులు థియేటర్కు చేరుకుంటారు. దీంతో కొంత ఆస్తి నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది. టికెట్లు లభించక పోతే కొన్నిసార్లు ప్రేక్షకులు థియేటర్ల దగ్గర  రచ్చ చేస్తూ ఉంటారు. అందుకే పెద్ద హీరో సినిమా కావడంతో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరుగుతాయేమో అని యజమానులు కాస్త ఆందోళన చెందు తున్నారు. ఇక ప్రేక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: