థమ్సప్ పోయి..మరొక బ్రాండ్ కు ఓకే చెప్పిన మహేష్..ఎన్ని కోట్లు అంటే..?
ఇక ఇదంతా ఇలా ఉండగా ఎన్నో సంవత్సరాల నుండి మహేష్ బాబు థమ్సప్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ నే ఉన్నారు. ఆ బ్రాండ్ తో ఈ సంవత్సరంలో అగ్రిమెంట్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ఒక కూల్ డ్రింక్ బ్రాండ్ కు మహేష్ బాబు ప్రమోషన్ కోసం సిద్ధమయ్యాడు." మౌంటెయిన్ డ్యూ" అనే ఒక కూల్ డ్రింక్ బ్రాండ్ కు ప్రచారం చేయడం కోసం మహేష్ బాబు సిద్ధమయ్యాడు. దానికి సంబంధించి ఒక పోస్టును కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేష్ బాబు.ఆ పోస్టర్ కాస్త వైరల్ గా మారుతోంది ఇప్పుడు.
అయితే ఇది వరకు "మౌంటెయిన్ డ్యూ" కూల్ డ్రింక్ తాగి ప్రమోషన్ కు హీరో అఖిల్ చేసేవారు. అది కూడా ఈ ఏడాది పూర్తి కావస్తోంది. ఇక యువ హీరోతో చేసుకున్న ఒప్పందం పూర్తికావడంతో..ఇప్పుడు ఈ బ్రాండ్ ను మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వెళ్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ బ్రాండ్ వాల్యూ మహేష్ బాబు పెంచుతారా లేదా అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక అందుకు గాను మహేష్ బాబు ఏడాదికి..15-20 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు గా సమాచారం. ఏది ఏమైనా మహేష్ బాబు కి బ్రాండ్ ల విషయం లో ఎవరు సాటిరారు.