రవితేజ ఆ సినిమాను వద్దనటానికి కారణం అదేనా...?

murali krishna
మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టమని తెలుస్తుంది.. ఎందుకంటే రవితేజ ఏడాది నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తున్నాడాట.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో ఈ ఏడాది మాస్ మహారాజ రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని తెలుస్తుంది.చాలా రోజుల తర్వాత హిట్ అందుకోవడంతో రవితేజ ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడట.. ఇక అయితే తాజాగా రవితేజ ఒక సినిమా నుండి తప్పించుకున్నాడని అతడి లక్ బాగుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుందట.ఈ న్యూస్ ఎందుకు బయటికి వచ్చిందంటే.. ఈ మధ్యనే రాజ్ తరుణ్ నటించిన 'అనుభవించు రాజా' సినిమా బాక్సాఫీస్ బరిలో నిలిచి ప్లాప్ అయ్యిందని తెలుస్తుంది . ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారట.. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఈ కథతో ముందుగా రవితేజ దగ్గరకు వెళ్ళాడని సమాచారం.కానీ రవితేజ ఈ సినిమాకు ఓకే చెప్పక పోవడంతో ఇక ఆయన రాజ్ తరుణ్ ను ఒప్పించి ఆయనతో సినిమా చేసాడని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించలేక చతికల పడిపోయిందట.దీంతో ఈ సినిమా ప్లాప్ నుండి రవితేజ తప్పించు కున్నాడని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' సినిమా చేస్తున్నాడట.ఈ సినిమా షూటింగ్ ముగించేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందట.. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరోక సినిమా చేయబోతున్నాడట.. శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను చేస్తున్నాడట.స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాను ప్రకటించాడట.. అన్ని సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: