బిగ్ బాస్ విన్నర్ గా 50 లక్షలు గెలిస్తే.. నేను అమ్మను అవుతా : పింకీ

praveen
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల చూపును ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బిగ్బాస్ కార్యక్రమం. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. దీంతో ప్రస్తుతం హౌస్ లో కేవలం ఏడు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏడు మంది కంటెస్టెంట్ లలో ఎలిమినేట్ అయ్యే ఇద్దరు ఎవరు... అంతేకాకుండా టాప్ ఫైవ్ లో కి వెల్లే ఐదుగురు కంటెస్టెంట్ ఎవరు అన్నది ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల జరిగిన ఎలిమినేషన్లో ఏకంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న రవి హౌస్ నుంచి ఎలిమినేషన్ అయి బయటకు రావడం అందరినీ షాక్ కి గురిచేసింది.

 అయితే రవి ఎలిమినేషన్ తర్వాత తెలుగు ప్రేక్షకులందరూ ఒక్కసారిగా షాకయ్యారు అని చెప్పాలి. టాప్ త్రీ లో ఉంటాడు అనుకున్న యాంకర్ రవి ఉన్న ఫలంగా ఒక్కసారిగా ఎలిమినేట్ అవడం ఏంటి అన్నది మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇక రవి ఎలిమినేషన్ తర్వాత తమ అభిమాన కంటెస్టెంట్ లకు మద్దతు తెలిపేందుకు సిద్ధం అయిపోయారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో రవి ఎలిమినేషన్ అనేది ఎవరూ ఊహించని ట్విస్ట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే నిన్న ఇక సండే ఎపిసోడ్ కాస్తఎంతో సందడి సందడి గా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే బిగ్బాస్ ప్రైస్ మనీ గెలిస్తే ఎవరు ఏం చేయబోతున్నారు అని నాగార్జున ప్రశ్నించగా..  అందరూ ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మొదట మాట్లాడింది. నేను యాభై లక్షలు గెలిస్తే ముందుగా  తల్లిదండ్రుల కోసం ముందుగా ఇల్లు కొనిస్తా.. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఉంది.. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ తప్పని సరిగా వుండాలి అని చెప్పారు. కాబట్టి బిగ్ బాస్ విన్నర్ గా ప్రైజ్ మనీ గెలిస్తే ఒక అమ్మాయి దత్తతగా తీసుకొని అమ్మ అని పిలిపించుకుంటా అంటూ ప్రియాంక చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: