అందరివాడు ప్లాప్ అవ్వడానికి కారణం అదేనా..?

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అందరికి తెలుసు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలను చూశారని అందరికి తెలుసు.

అలాగే ఒకప్పుడు ఇండస్ట్రీలో దర్శకుడు శ్రీనువైట్ల అంటే ఎంతటి క్రేజ్ ఉందేదో చెప్పాల్సిన పని లేదు ఇక ఈ స్టార్స్ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున అంచనాలను పెట్టుకుంటారని ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమానే అందరివాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత అంచనాలను చేరుకోలేక పోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా నిలబడిందని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనువైట్ల ఈ సినిమా విశేషాల గురించి గుర్తు చేసుకున్నారని తెలుస్తుంది.ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ అందరివాడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణం సినిమా కథెనని ఆ కథలో తాను రచించలేదన్న విషయాన్ని శ్రీనువైట్ల తెలియజేశారట .కథ సిద్ధంగా ఉంది వచ్చి డైరెక్ట్ చేయమంటే చేశానని చెప్పుకొచ్చారట.అయితే అప్పటికే చిరంజీవి కోసం ఒక కథను సిద్ధం చేసి పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా శీను వైట్ల వెల్లడించారని తెలుస్తుంది. అయితే మరి ఆ విషయాన్ని చిరంజీవిగారికి ఎందుకు చెప్పలేదు అన్న ప్రశ్న శ్రీనువైట్లకు ఎదురైందని తెలుస్తుంది.

ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ చిరంజీవి గారు ఒక పెద్ద స్టార్ అని ఆయనతో వచ్చిన సమస్య అదేనని అతను స్టార్ కావడం వల్ల అతను తిరిగి సమాధానం చెప్పలేమని ఈ సందర్భంగా శ్రీను వైట్ల వెల్లడించారట. అలా 2005లో భూపతి రాజా అందించిన అందరివాడు సినిమా కథను తాను డైరెక్ట్ చేశానని ఈ సందర్భంగా శ్రీను వైట్ల వెల్లడించారని తెలుస్తుంది.ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమాల విషయానికొస్తే ఢీ సినిమా సీక్వెల్ గా మంచు విష్ణుతో కలిసి ఢీ అంటే ఢీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: