సర్ప్రైస్ ఇచ్చేందుకు ప్రభాస్ రెడీ.. ఆసక్తికర పోస్ట్?
కాగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఇక ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. హిస్టోరికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో మొదటిసారి పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులందరినీ తెగ ఆకర్షించింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అటు ప్రేక్షకులు అందరూ కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు జరగబోతుంది.
ఈ క్రమంలోనే ఇక ప్రభాస్ పుట్టిన రోజున ఎంతో క్రేజ్ ఈ అప్డేట్ ఉండే అవకాశం ఉంది అని ప్రస్తుతం అందరూ అంచనా వేస్తున్నారు. అప్డేట్ ఎలా ఉండబోతుంది అనేదానిపై ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచే విధంగా ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ ఒక పోస్టు పెట్టారు. విక్రమ్ ఆదిత్య ఎవరు.. మీరు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా రాధేశ్యామ్ టీజర్ కోసం వేచి చూడండి. ఈ నెల 23వ తేదీన మీ ముందుకు రాబోతుంది ఈ టీజర్ అంటూ ప్రభాస్ ఒక పోస్ట్ పెట్టాడు ఇక ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.