ఇకనైనా మెగాస్టార్ రంగంలోకి దిగాల్సిందే అంటున్నారు .... ??

GVK Writings
ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ ఎలెక్షన్ కి సంబంధించి జరుగుతున్న రగడ అంతా ఇంతా కాదనే చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై యువ హీరో మంచు విష్ణు భారీ ఆధిక్యత తో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ నుండి కూడా ఈ ఇద్దరూ కూడా తమ తమ గెలుపు కోసం ఎంతో బాగా ప్రయత్నించి, తమ మ్యానిఫెస్టోలని వెల్లడించడంతో పాటు పలువురు సినిమా ప్రముఖుల నుండి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే సీనియర్ నటులు కృష్ణ, కృష్ణంరాజూ, ఇక బాలయ్య వంటి నటుల నుండి మద్దతు అందుకున్న విష్ణు మా అధ్యక్షుడిగా గెలవడంతో ప్రకాష్ రాజ్ తన మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే అంతటితో ఆగని ప్రకాష్ రాజ్, మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తన ప్యానల్ సభ్యులు కూడా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు నేడు ఒక మీటింగ్ పెట్టి తెలిపారు. కాగా వారి ప్యానల్ లో పలువురు మోహన్ బాబు పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగని ప్రకాష్ రాజ్, త్వరలో ఆత్మా పేరుతో మరొక సరికొత్త సంఘాన్ని నెలకొల్పనున్నారు అనే వార్తలు ప్రస్తుతం సినెమా పరిశ్రమలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వివాదం మరింతగా ముదురుతూ ఉండడంతో ఇకనైనా పరిశ్రమ పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి వీటిని సర్దుమణిగేలా చేయాలనీ పలువురు ప్రేక్షకాభిమానులతో పాటు కొందరు సినిమా ప్రముఖులు కూడా కోరుతున్నారు. నిజానికి ఇదివరకెన్నడూ లేని విధంగా మాలో తారా స్థాయికి ఒక వర్గం పై మరొక వర్గం విమర్శలు చేయడంతో పాటు పలు విధాలుగా నిందిస్తుండడం సినిమా పరిశ్రమకి ఏ మాత్రం మంచిది కాదని, త్వరలో చిరంజీవి కలుగచేసుకుని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: