రాజమౌళి నాలుగు సినిమాలు.. ఒక్క టికెట్ పై?
ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో జడ్జిగా ఇంద్రజ కొనసాగుతోంది. ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని ఎల్లలు దాటించిన దర్శకుడు.. తెలుగు వారి గౌరవాన్ని మరింత పెంచిన వ్యక్తి.. ప్రతి సినిమాని కూడా శిల్పంలా చెక్కి.. రికార్డులు కొల్లగొట్టే ధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి తెరకెక్కించిన నాలుగు సినిమాలను ఒకే పర్ఫామెన్స్ లో చూపించారు.
ఒక్క టికెట్ పై నాలుగు సూపర్ హిట్ సినిమాలు చూడాలని ఉందా.. అయితే రాజమౌళి తెరకెక్కించిన నాలుగు సినిమాలు చూపించేందుకు రాంప్రసాద్ వచ్చేస్తున్నాడు అంటూ సుదీర్ చెప్పగానే పర్ఫామెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర.. రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు.. సునీల్ హీరోగా తెరకెక్కిన మర్యాద రామన్న.. నాని హీరోగా తెరకెక్కిన ఈగా సినిమాలను ఒకటే పర్ఫామెన్స్ లో చూపించారు. ప్రోమోలో భాగంగా ఈ పర్ఫామెన్స్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత మగధీర సీన్ రిపీట్ చేయడానికి హైపర్ ఆది వెళ్లి ఇంద్రజ చేయి పట్టుకుంటాడు.. ఇక అంత లోనే ముత్యాల చెమ్మచెక్క అనే సాంగ్ రావడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు.