ఫిల్మ్ నగర్ లో ఎక్కడ చూసినా నాగచైతన్య సమంత విడిపోతున్నారనే వార్తే హాట్ టాపిక్ గా మారింది. చైతూ సామ్ లు ఇప్పటికే కోర్టుకు విడాకుల కోసం అప్లై చేసుకున్నారని త్వరలోనే విడాకుల వార్త మనం వినభోతున్నామని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వార్తలకు బలం చేకూరేలా పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు నెల రోజులుగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని మీడియా కోడై కూసినా అటు నాగ చైతన్య ఇటు సమంత స్పందించింది లేదు. ఓకవేళ వారు విడిపోయేది అబద్దమే అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు మేం విడిపోవట్లేదని క్లారిటీ ఇచ్చేవారు. అంతే కాకుండా నాగచైతన్య హైదరాబాద్ ఉండగా సమంత తన చెన్నై కి వెళ్లి పోవడం కూడా విడాకుల అనుమానాలకు బలాన్ని ఇస్తోంది.
ఇక తన కొడుకు కోడలు పై వస్తున్న వార్తలను నాగార్జున అయినా ఖండించాల్సింది కానీ అదికూడా ఇప్పటి వరకూ జరగకపోవడం తో త్వరలో సామ్ చై విడాకులు కన్ఫామ్ అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ పెద్దలు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని నాగార్జున చై సామ్ లకు కౌన్సిలింగ్ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం సమంత నాగచైతన్య విడాకులు దాదాపు ఖరారు అయినట్టుగా సంచలన వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి సమంత నాగ చైతన్య నుండి భారీ మొత్తంలో భరణం పుచ్చుకోవడం.
సమంత తన భర్త నాగ చైతన్య నుండి ఏకంగా 300కోట్ల భరణం పుచ్చుకుంటోందట. అయితే అంతా డబ్బు కాకపోయినా స్థిర చర ఆస్తుల రూపంలో ఈ మొత్తం ఉండబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. అయితే సామ్ చై లు విడిపోవడం మాత్రం అటు అక్కినేని అభిమానులకు గానీ ఇటు సమంత అభిమానులకు గానీ మింగుడు పడటం లేదు. తమ అభిమాన హీరో హీరోయిన్ లు కలకాలం కలిసి ఉండాలని సమంత చైతూ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చై సామ్ ల విడాకుల వ్యవహారం చివరకు ఎక్కడకు చేరుకుంటుందో చూడాలి మరి.