ఎకడా..అంటూ వచ్చిన ఈ భామ ఎక్కడ..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన కొత్త బంగారు లోకం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఎకడా అనే డైలాగ్ తో బాగా పాపులారిటీని అందుకుంది. అంతే కాదు ఎంతో మంది అబ్బాయిలకు కలల రాకుమారిగా నిలిచిపోయింది. ఆమే.. శ్వేతబసు ప్రసాద్. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ. ఆ తర్వాత కాస్కో, రైడ్, కలవర్ కింగ్, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా ఇలా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ, తగిన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
ఈమె సినిమాలకు ముందే 2002వ సంవత్సరంలో పకడీ అనే సినిమాతో జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. కానీ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ, ఈమెకు గుర్తింపు రాకపోవడంతో తిరిగి సైడ్ క్యారెక్టర్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది. జీనియస్ లో ఐటమ్ సాంగ్ లో శ్వేత బసు ప్రసాద్ ను మనం చూడవచ్చు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న శ్వేత జీవితంలో ఒక్క సారిగా 2014వ సంవత్సరంలో వ్యభిచారం చేస్తూ, గృహాన్ని కూడా నడుపుతోంది అంటూ ఆమెపై కేసు నమోదైంది.
అంతేకాదు సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త యువతకు ఆమె అవకాశాలు ఇప్పిస్తానని , వ్యభిచార రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. ఆమెను మాత్రమే అదుపులోకి తీసుకోవడం.. ఇక ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.." నేను ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవడం కారణంగా ఇలాంటి పని చేశాను అంటూ ఆమె తెలిపింది. అంతేకాదు అక్కడ కేవలం ఈమెను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. నేను తప్పు చేశాను కాబట్టి అధికారులు నన్ను అరెస్టు చేశారు. అందులో వారి తప్పు లేదు.. ఇక ప్రజలు అంటారా..? ఏదైనా ఒక కొత్త విషయం తెలిస్తే వారు పుకార్లు  సృష్టించడానికి ముందుంటారు.. అంటూ ఆమె తెలిపింది. అయితే ఆ తర్వాత ఆమె ఎక్కడుంది.. ఏం చేస్తోంది.. అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: