చిరంజీవి పిలిచి టిఫిన్ పెడితే ఆ హీరో వద్దన్నాడట... ?

VAMSI
ఒకప్పుడు హీరోగా కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జేడీ చక్రవర్తి. ఆ తరువాత కొంత కాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగాడు. ఈయన నటుడిగానే కాదు దర్శకుడిగా సైతం తానేంటో నిరూపించుకున్నాడు. ఇతను నటనకు తొలి అడుగులు పడింది తన గురువు అయిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన "శివ" సినిమాతోనే కావడం విశేషం. ఈ సినిమాలో నెగిటివ్ ఛాయలున్న పాత్రను పోషించి అందరి మెప్పు పొందాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ఆ తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. మొత్తంగా 50 లోపు చిత్రాలలో వివిధ పాత్రలను పోషించారు. దర్శకుడిగా కూడా తన సత్తాను నిరూపించుకున్నాడు. ఈయన దర్శకత్వం చేసిన సినిమాలలో హోమం, సిద్దం, మనీ మనీ మోర్ మనీ, ఆల్ ద బెస్ట్ చిత్రాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అసలు ఏమి జరిగిందో చూద్దాం... ఆ రోజుల్లో చిరంజీవి సొంత ఇల్లు నిర్మించుకుని అందరినీ ఆహ్వానిస్తూ జేడీ చక్రవర్తి ని కూడా పిలిచారట. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి జేడీ చక్రవర్తి ఇలా వివరించారు. చిరంజీవి గారు అక్కడున్న అతిథులతో పాటుగా నాకు కూడా ఉప్మాను వడ్డిస్తూ చక్రవర్తి గారు ఈ ఉప్మాలో కొంచెం నెయ్యి వేసుకుని ఆవకాయ వేసి తింటే చాలా బాగుంటుంది అన్నాడట, కానీ నేను అవేమీ పట్టించుకోకుండా అలా చిరంజీవి గారినే చూస్తున్నాను. ఇంకా ఆయన నన్ను అడుగుతుంటే ఒకటే చెప్పాను...చిరంజీవి గారు మీరు ఉప్మా దోశలు అన్నీ  వారికే పెట్టండి...నన్ను మిమ్మల్ని ఇలా  చూడనివ్వండి చాలు అని చెప్పాను.

చిరంజీవి గారు నన్ను చక్రవర్తి గారు అంటుంటే ఇంత కన్నా ఈ జన్మకు ఇంకేమి వద్దు. అంత ప్రేమ అభిమానం నాకు చిరంజీవి గారు అంటే... ఎంత ఇష్టం అంటే, రుద్ర వీణ విడుదల సమయంలో వెంకటరమణ థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళాను. అప్పుడు నా వయస్సు 12 సంవత్సరాలు ఉండొచ్చు. అక్కడ నన్ను పోలీసులు పిల్లవాడిని అని కూడా చూడకుండా కొట్టారు. బొటన వేలు నొప్పిగా ఉన్నా అలానే ఒక చేత్తో బొటన వేలును పట్టుకుని సినిమా చూశాను. అంత ప్రేమ అండి చిరంజీవి గారు అంటే...ఇంత కన్నా మంచి ఉదాహరణ ఏమి చెప్పగలను అంటూ ముగించాడు జేడీ చక్రవర్తి. ఆ విధంగా చిరంజీవిపై తన కున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: