కలల భారతం : కుల రహిత సమాజం నిర్మితమవుతుందా?
పేద కులాల వారు ఎటువంటి అణచివేతకు గురికాకుండా అన్ని పేద బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ లు కల్పించాలని అప్పటి రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటి అధ్యక్షుడు అయిన డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దాని ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగింది.స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలు అయిన కొన్ని ప్రాంతాలలో పేదవారు అయిన దళితులు ఇంకనూ అణిచివేతకు గురి అవుతున్నారు.దేశంలో స్వతంత్రం రాకముందు అగ్రవర్ణ కులాలకు మాత్రమే చట్ట సభలలో పాల్గొనే అధికారం ఉండేది. కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రకటించిన రిజర్వేషన్ ల ఆధారంగా వారికి చట్ట సభలలో వారికీ సీట్లు కేటాయించడం జరిగింది. ఎన్నో ఏళ్లగా అణచివేతకు గురి అవుతున్న మహిళలకు కూడా 33శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ దేశంలో మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప అని చాలా గొడవలు జరుగుతున్నాయి. మనిషికి మనిషికి దూరం పెరిగిపోతుంది. దేశం అభివృద్ధి చెందాలంటే కుల రహిత సామ్రాజ్యం రావాలి. రాబోయే రోజులలో ఈ కుల రహిత సామ్రాజ్యం రావాలని ఆశిద్దాం.