కొత్త రోల్లో ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తి ?

VUYYURU SUBHASH
టాలీవుడ్ హీరోల రెమ్యున‌రేష‌న్లు ఇటీవ‌ల కోట్ల‌లోనే ఉంటున్నాయి. ఇక్క‌డ స్టార్ హీరోలు త‌మ‌కు ఇచ్చే రెమ్యున‌రేష‌న్‌తో పాటే బిజినెస్‌లో లాభాలు అన్నీ క‌లిపి రు. 40 నుంచి రు. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్లు తీసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోల‌తో స‌మాన‌మైన రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోన్న మ‌న హీరోలు, ద‌ర్శ‌కులు ఇప్పుడు కొత్త కొత్త వ్యాపారాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇత‌ర రంగాల్లో భారీ పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు థియేట‌ర్ల వ్యాపారంలోకి కూడా వ‌చ్చాడు. అటు విజ‌య్ దేవ‌ర‌కొండ తో పాటు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం భారీ ఎత్తున రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల‌తో పాటు థియేట‌ర్ల వ్యాపారంలోకి వ‌చ్చేవాడు.

ఇక సీనియ‌ర్ హీరో నాగార్జున వేలు పెట్ట‌ని బిజినెస్ అంటూ ఉండ‌దు. ఆయ‌న అన్ని ర‌కాల బిజినెస్‌లు చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సైతం తాను సంపాదించిన డ‌బ్బును అనేక రంగాల్లో పెట్టుబ‌డి పెట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ కాస్త కొత్త‌గా ఫామ్ హౌజ్‌ల‌పై మ‌న‌సు పారేసుకున్న‌ట్టు తెలుస్తోంది.  ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ శివార్లలో ఓ స్థలం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో త‌న అభిరుచికి అనుగుణంగా పెద్ద ఫాంహౌస్ క‌ట్ట‌బోతున్నాడ‌ట‌.

న‌గ‌ర శివార్ల‌లో ఉన్న శంక‌ర్ ప‌ల్లికి స‌మీపంలో గోపాల‌పురంలో 6 ఎక‌రాల భూమి కొనుగోలు చేశాడు. ఇటీవ‌లే ఎన్టీఆర్ స్వ‌యంగా వెళ్లి ఈ భూమికి సంబంధించిన రిజ‌స్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేశాడు. ఇందులో ర‌క‌ర‌కాల పూల మొక్క‌లు, గ్రీన‌రి, విదేశాల నుంచి వ‌చ్చే పూల మొక్క‌ల‌తో చాలా అందంగా తీర్చిదిద్ద‌నున్నార‌ట‌. ఎన్టీఆర్ వీకెండ్ లేదా ఇత‌ర‌త్రా బోర్‌గా ఉన్న‌ప్పుడు వ‌చ్చి ఇక్క‌డ ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి త‌న అభిరుచికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దే బాధ్య‌త‌ల‌ను తీసుకున్నార‌ట‌. సో మొత్తానికి ఎన్టీఆర్ త‌న భార్య‌కు కూడా ఓ బాధ్య‌త అప్ప‌గించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: