ఒక్క మూవీతోనే సినీ ఇండస్ట్రీ ని తన వైపు చూసేలా చేసిన హీరోయిన్ ?
ఎక్కువగా హీరోయిన్లు ఒక్క సినిమాతోనే స్టార్డమ్ సంపాదించి, అతి తక్కువ సమయంలోనే కనుమరుగైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా తమ నటనతో, తమ అందంతో మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్ లలో హీరోయిన్ మందాకిని కూడా ఒకరని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ కేవలం ఒక్క పాటతోనే ఎంత పాపులర్ సంపాదించింది అంటే..ఒకానొక సమయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా, అందరి కళ్ళు తన వైపు తిప్పుకున్న ఈ భామ గురించి తెలుసుకుందాం.
ఈమె అసలు పేరు"యాస్మిన్ జోసెఫ్" . ఈమెను ముద్దుగా మందాకినీ అని పిలుస్తారు. ఈమె 22 సంవత్సరాల వయసున్నప్పుడు "రామ్ తేరీ గంగా మైలీ" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈమె ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాల మేరకు అర్థనగ్నంగా కూడా నటించింది. అలా తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది ఈ భామ. ఇందులోనే ఒక పాటలో ఈ సన్నివేశాలను చేసింది.
ఇక దేశం మొత్తం అమ్మ పాటతో ఈమె బాగా పాపులర్ అవడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు కూడా అడుగులు వేయసాగింది. ఇక అప్పట్లోనే భారీ బడ్జెట్ తో సూపర్ స్టార్ కృష్ణ సరసన "సింహాసనం"అనే సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులో మందాకిని ఒక పాటలో కనిపించి, ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఆ తర్వాత 1987 లో కోదండరామి రెడ్డి డైరెక్షన్ లో నటసింహ బాలకృష్ణతో కలిసి నటించింది.
అలా అలరించిన ఈ ముద్దుగుమ్మ 1997వ సంవత్సరంలో ఒక ఒక పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోవడంతో, ఈమె సినిమాలకు దూరంగా ఉంది. ఇక వీరిద్దరికీ ఒక కొడుకు, కుమార్తె కూడా జన్మించడం జరిగింది. ఇక చివరిగా ఈమె 1996 లో "జోర్దార్" అనే సినిమాల్లో నటించి, ఇక ఆ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది ఈ భామ . ప్రస్తుతం కుటుంబంతో జీవనం కొనసాగిస్తోంది.