బెల్లంకొండ శ్రీనివాస్ కు విజయ్ సేతుపతి గ్రహణం !

Seetha Sailaja

దక్షిణాది సినిమా రంగంలో మాత్రమే కాదు బాలీవుడ్ కు కూడ విజయ్ సేతుపతి మ్యానియా సోకింది. అతడు డేట్స్ ఇస్తే చాలు అంటూ అతడి చుట్టూ అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు దర్శకులు ప్రదక్షణాలు చేస్తున్నారు. అయితే తాను నటించే మూవీ కథ ఎంపిక విషయంలో చాల విభిన్నంగా ప్రవర్తిస్తున్న ఈ విలక్షణ నటుడుని ఒక సినిమా విషయంలో మెప్పించాలి అంటే చాల కష్టపడవలసి వస్తోంది.


విజయ్ సేతుపతి బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ పై మనసు పడటం హాట్ టాపిక్ గా మారింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలలో అధిక భాగం ఫెయిల్యూర్స్. అయితే అతడు నటించిన ‘రాక్షసుడు’ మూవీ మాత్రం హిట్ యాక్షన్ సస్పెన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈమూవీలో బెల్లంకొండ శ్రీను పోలీస్ పాత్రలో బాగా నటించి మెప్పించాడు. దర్శకుడు రమేష్ వర్మ ఈ మూవీని డీల్ చేసిన విషయం నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.


దీనితో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది అంటూ గత కొన్నిరోజులుగా వార్తలు రావడంతో ఆ సీక్వెల్ లో బెల్లంకొండ నటిస్తాడు అని అనుకున్నారు అంతా. అయితే వాస్తవం వేరు ఈ మూవీ సీక్వెల్ లో బెల్లంకొండ ను తప్పించి విజయ్ సేతుపతి ని ఈ మూవీ నిర్మాతలు ఎంపిక చేసారు. ఈమధ్యనే దర్శకుడు రమేష్ వర్మ చెన్నై వెళ్ళి విజయ్ సేతుపతిని కలిసి ఈ మూవీ సీక్వెల్ కథను వినిపించినట్లు టాక్.

విజయ్ సేతుపతికి ఈ సీక్వెల్ కథ బాగా నచ్చడంతో అతడు తన అంగీకారం తెలపడంతో వెంటనే ఈమూవీ నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేసారు. వాస్తవానికి ‘రాక్షసుడు’ మూవీ మాతృక అయిన తమిళంలో సెకండ్ పార్ట్ సీక్వెల్ లేదు అయితే ఇది అంతా రమేష్ వర్మ ఊహ అని తెలుస్తోంది. ఇప్పటికే పాపులర్ అయిన మూవీ కాబట్టి ఈ ప్రాజెక్ట్ లో విజయ్ సేతుపతి రాకతో ఈ మూవీ చాల క్రేజీ మూవీగా మారే ఆస్కారం కనిపిస్తోంది..  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: