సోషల్
మీడియా ద్వారా తమ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంది "ఎనిమీ" చిత్రబృందం. విలక్షణ నటుడు విశాల్,
ఆర్య హీరోలుగా రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్
మూవీ 'ఎనిమీ'. గతంలో వీరిద్దరూ కలిసి "వాడు-వీడు’" సినిమాలో నటించగా "ఎనిమీ" మూవీతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా...మినీ స్టూడియోస్ పతాకంపై ప్రముఖ
నిర్మాత వినోద్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ
సినిమా తెరకెక్కగా
విశాల్,
ఆర్య కాంబో పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ
సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ సోషల్
మీడియా వేదికపై ప్రకటించింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో తీసుకున్న ఒక ప్రత్యేకమైన ఫొటోని పోస్ట్ చేసి అభిమానులను సర్
ప్రైజ్ చేశారు. "ఎనిమీ" చిత్ర షూటింగ్ కంప్లీట్ అయిందని.. వీలైనంత త్వరలో టీజర్ ను రిలీజ్ చేస్తామని అని పేర్కొన్నారు
హీరో విశాల్.
మమతా మోహన్ దాస్, మృణాళిని
రవి ఈ చిత్రంలో
హీరోయిన్ గా చేశారు. పేరుకి వీరు
తమిళ హీరోలే అయినా తెలుగులోనూ వీరికి మంచి క్రేజ్ ఉంది. పందెంకోడి, పొగరు, సెల్యూట్ వంటి
తమిళ్ డబ్ చిత్రాలతో
విశాల్ తెలుగులో అభిమానుల సంఖ్య పెంచుకోగా, వాడు వీడు, నేనే అంబానీ , ఆట ఆరంభం, సైజ్ జీరో, రాజా రాణి వంటి సినిమాలతో
టాలీవుడ్ లో క్రేజ్ ను పెంచుకున్నాడు
హీరో ఆర్య.
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వరుడు సినిమాలో నెగటివ్ రోల్ కూడా చేసాడు ఆర్య.
సినిమా అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ..ఆర్య పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. వీరిద్దరి కాంబో ఇప్పటికే హిట్ కాగా, ఈ
సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నారు.
కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న కారణంగా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. దాదాపుగా చిన్న సినిమాలన్నీ ఓ టి టి బాట పడుతుండగా, ఈ సినిమాపై నిర్మాతలు ఏ నిర్ణయాన్ని తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది. ఈ
సినిమా పేరులోనే కథ ఏమిటన్నది తెలుస్తోంది. మరి ఇందులో వీరిద్దరి మధ్య జరిగే
టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి. షూటింగ్ అయిపోయింది కనుక ఇక థియేటర్లోనే అసలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు.