సముద్రఖని తో డీల్ కుదుర్చుకున్న మహేష్ !

Seetha Sailaja
దర్శకులు పేరుగాంచిన క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. దాసరి నారాయణరావు విశ్వనాథ్ భాగ్యరాజ్ గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు నటులుగా కూడ బాగా రాణించి మెప్పించారు. అయితే వీరంతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ప్రశంసలు అందుకున్నారు కాని విలన్ పాత్రలలో రాణించలేదు.

అయితే ఈ విషయంలో తమిళ దర్శకుడు సముద్రఖని చాల ముందు వరసలో ఉన్నాడు. ‘అల వైకుంఠపురములో’ ‘క్రాక్’ మూవీల విజయంలో సముద్రఖని విలని పాత్ర ఆసినిమాల ఘన విజయానికి చాల సహకరించింది. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో కూడ ఇతడు కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. తను నటించే ప్రతి సినిమాలోను ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ని ఎంచుకుని సముద్రఖని ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నాడు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఇతని మ్యానియా మహేష్ బాబు కు కూడ తాకినట్లు తెలుస్తోంది. పరుశు రామ్ దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీలో మెయిన్ విలన్ గా సముధ్రఖని నటిస్తున్నాడు. వాస్తవానికి ఈ పాత్రను తమిళ హీరో అర్జున్ తో చేయించాలని భావించారు. అయితే చివరి నిముషంలో ఆలోచనలు మారి సముఖ్రఖని వైపు అడుగులు పడినట్లు టాక్.

మూవీ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి మహేష్ ఈ సంవత్సరం దసరా లోపే త్రివిక్రమ్ మూవీ వైపు వెళ్లాలని గట్టి పట్టుదల పై ఉన్నాడు. కరోనా పరిస్థితులు వల్ల ఈ సంవత్సరం మహేష్ అభిమానులకు అతడి నుండి సినిమా లేకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ సమ్మర్ రేస్ కు త్రివిక్రమ్ మూవీ లను విడుదల చేసి తన అభిమానులకు మహేష్ డబల్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలలో ఉన్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో పర భాషా విలన్స్ హవా కొనసాగుతున్న పరిస్థితులలో సముద్రఖని ఎంట్రీతో పర భాషా విలన్స్ సంఖ్య మరింత పెరిగిపోతోంది..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: