పరశురామ్ ని తొందర చేస్తున్న మహేష్... త్రివిక్రమ్ కోసమేనా?
ఇక నిర్మాతలు మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబోలో సినిమా పట్టాలు ఎక్కబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.త్రివిక్రమ్ గత సంవత్సరం నుండి ఖాళీగా ఉన్నాడు.కాబట్టి వెంటనే సూపర్ స్టార్ తో సినిమా మొదలు పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట.అందుకే పరశురామ్ ని మూడు నెలల్లో ఈ సినిమాని పూర్తి చెయ్యాలని తొందర చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక పరశురామ్ కూడా ఈ సినిమాని తనదైన స్టైల్ లో తెరకెక్కించి తొందరగా షూటింగ్ పూర్తి చేసి మహేష్ కి మంచి హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట. స్వతహగా పరశురామ్ మహేష్ అభిమాని కావడంతో మహేష్ ఫ్యాన్స్ కి కావాల్సిన అంశాలన్ని ఈ సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యస్ యస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.