డమ్మీ ఎపిసోడ్స్ లో యంగ్ టైగర్..?
ఈ షో కోసం తారక్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఇది వరకే వార్తలు వచ్చాయి. ఈ షోకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల జెమిని టీవీలో విడుదల చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఈ షోను త్వరగా ప్రసారం చేయాలని ఉత్సుకతతో ఉన్నారట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఈ షో కూడా ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని ప్రస్తుతం తెలుస్తోంది.
ఈ షోకు సంబంధించిన షూటింగ్ ను ఈ వీకెండ్ లో చేసేందుకు సిద్ధమయ్యారట. జూలై ఏడు నుంచి ఈ షూటింగ్ ను ప్రారంభించాలని టీం భావిస్తుందట. ఎలాగైనా త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేసి వచ్చే నెల నుంచి ఈ షోను ప్రసారం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంటర్టైన్ మెంట్ మాత్రమే కాకుండా ఈ షోలో నాలెడ్జ్కు కూడా ప్రాధాన్యం ఉండటంతో ఎలాగైనా సరే హిట్ అవుతుందని నిర్వాహకులు చాలా నమ్మకంగా ఉన్నారట. ప్రస్తుతం యంగ్ టైగర్ రాజమౌలి దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ RRR లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.