ఆ సినిమా ప్రక్కన పెట్టేసినట్లే : కుండబద్దలు కొట్టిన బాలయ్య .... !!

GVK Writings
ఇటీవల కెరీర్ పరంగా వరుసగా పరాజయాలు చవిచూస్తూ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను తో చేస్తున్న అఖండ మూవీ తో ఎలాగైనా పక్కాగా సక్సెస్ కొట్టాలని ఎంతో కసితో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ చాలావరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
ఇక ఈ మూవీ తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక మూవీ చేయనున్నారు బాలయ్య. అనంతరం అనిల్ రావిపూడి తో కూడా ఆయన ఒక మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే, నిన్న తన జన్మదినం సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ప్రత్యేకంగా వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య తన సినిమాల లైనప్ గురించి చెప్పుకొచ్చారు..

త్వరలో తనయుడు మోక్షజ్ఞ తో కలిసి ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 మూవీ ఉంటుందని, అయితే తన కెరీర్ లో ఎప్పటినుండో తాను తీయాలని భావిస్తున్న నర్తనశాల చిత్రం మాత్రం ఇకపై రూపుదిద్దుకునే ఛాన్స్ లేదని కుండబద్దలు కొట్టారు బాలయ్య. గతంలో దివంగత నటి సౌందర్యని ద్రౌపది పాత్రకు ఎంపిక చేసాం అని, అయితే సౌందర్య తరువాత ప్రస్తుతం ఉన్న నటీమణుల్లో ఆ పాత్రని పోషించగల కథానాయిక తనకు కనిపించలేదని అందుకే ఇకపై ఆ సినిమా చేయదల్చుకోవడం లేదని ఆయన అన్నారు. అలానే ఇకపై తన నుండి రాబోవు చిత్రాలు అన్ని కూడా తప్పకుండా ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటాయని, ఆ విధంగా స్క్రిప్ట్ లు ఎంచుకుంటున్నట్లు చెప్పారు బాలయ్య ..... !!  

Find Out More:

Related Articles: