థర్డ్ వేవ్ భయాలతో రాజమౌళి కన్ఫ్యూజన్ !
ఈ ఏడాది సంక్రాంతికి రావలసిన ఈమూవీ 2021 దసరా కు మారినా ఇంకా కరోనా థర్డ్ వేవ్ భయాల మధ్య ఉండటంతో ఈమూవీ విడుదల అయ్యేది 2022 సమ్మర్ కు అన్న అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి ఇదే విషయాన్ని రాజమౌళి తన టీం మెంబెర్స్ కు పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి ‘ఆర్ ఆర్ ఆర్’ ను విడుదల చేస్తే అదే సమయానికి కరోనా థర్డ్ వేవ్ వస్తే మళ్ళీ ఉవ్యవహారం మొదటికి వస్తుందని అందుకే ఏకంగా సమ్మర్ కు ప్రిపేర్ కావడం మంచిదని రాజమౌళి ఆలోచన. కరోనా రెండో దశ విషయంలో పరిశొధకుల మాటలు అక్షరాలా నిజం అయ్యాయి. కాబట్టి థర్డ్ వేవ్ విషయంలో కూడ అంచనాలు నిజం అయితే అసలుకు మోసం వస్తుందని రాజమౌళి భావన అని తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా కొంతమంది శాస్త్రవేత్తలు కరోన థర్డ్ వేవ్ వస్తుంది అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు అని చెపుతున్న పరిస్థితులలో ఎటు తేల్చుకోలేని కన్ఫ్యూజన్ లో రాజమౌళి ఉన్నట్లు టాక్. ఇదే జరిగితే సంక్రాంతి సినిమాల రేస్ లో చాల టాప్ హీరోల సినిమాలకు లైన్ క్లియర్ అయ్యే ఆస్కారం ఉంది..