మెగాహీరోల మల్టీ స్టార్ సినిమా డైరెక్టర్ ఎవరంటే..?

N.ANJI
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా మల్టీ స్టార్ సినిమాలపై వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వెంకటేష్-మహేష్ బాబు, వెంకటేష్ - పవన్ కళ్యాణ్, దర్శధీరుడు దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం  చిరంజీవి, వరుణ్ తేజ్ కలిసి లూసిఫర్ రీమేక్ సినిమాలో నటించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినా స్నాగతి అందరికి తెలిసిందే.
అయితే తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ లో మల్టీస్టార్ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో రామ్ చరణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని ఒక వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం అనే చెప్పాలి.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా తరవాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం చేశారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తైన తరువాత చరణ్, సాయితేజ్ లతో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్ సినిమాను తెరక్కేకించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
ఇక ఇప్పటికే రామ్ చరణ్, సాయితేజ్ లకు ప్రశాంత్ నీల్ కథ వినిపించారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ రేంజ్ లో ఈ సినిమాను నిర్మించాలని డీవీవీ దానయ్య భావిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక చరణ్ సాయితేజ్ కాంబో గురించి వార్తలు వస్తుండటంతో మెగా అభిమానులో సందడి నెలకొంది. ఈ వార్త నిజమైతే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి, శంకర్ సినిమాలు పూర్తైన తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: