మేజర్ విషయంలో తగ్గేదే లే అంటున్న సూపర్ స్టార్..

Purushottham Vinay
కరోనా ప్రభావం వలన లాక్ డౌన్ టైంలో సినిమా థియేటర్లు మూత పడడంతో జనాలకు ఓటీటీలు బాగా అలవాటయ్యాయి.ఇక అలాగే ఓటిటీల వల్ల లాభ పడుతున్నందుకు ఆ ఓటీటీ కంపెనీలు ఆఫర్స్ తో ఆకట్టుకోవడం స్టార్ట్ చేశాయి. భవిష్యత్తులో థియేటర్స్ బిజినెస్ పడిపోయే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఓటీటీ సంస్థలు కొంతవరకు హింట్ ఇచ్చేశాయి కూడా. అన్ని సినిమాలు థియేటర్స్ లో అడలేవని కూడా అర్ధమయ్యింది. ఇక సెకండ్ వేవ్ లో విడుదలకు నోచుకోని సినిమాలపై బడా కంపెనీలు దృష్టి పెట్టాయి. ప్రస్తుతం అందరి చూపు మేజర్ సినిమాపైనే ఉంది. ముంబై ఉగ్ర దాడుల్లో మరణించిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన విషయం తెలిసిందే.

క్షణం, గుడాచారి లతో మెప్పించిన టాలెంటెడ్ డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా సోని పిక్చర్స్ తో కలిసి మహేష్ బాబు GMB ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించింది.ఇక సినిమాకు ఇటీవల నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం. ఇదివరకే ఆమెజాన్ ప్రైమ్ ప్రయత్నం చేసి డ్రాప్ అయ్యింది. ఇక బడ్జెట్ కంటే మరో 5కోట్లు ప్రాఫిట్స్ వచ్చేలా ఆఫర్ ఇచ్చినప్పటికీ నిర్మాతలు ఒప్పుకోవడం లేదట. ముఖ్యంగా. మహేష్ బాబు ఎన్ని ఓటీటీ ఆఫర్స్ వచ్చిన తగ్గేదే లే అంటున్నాడట.ఓటీటీ అనే ఆలోచనలోనే ఉండడం లేదట. థియేటర్స్ లోనే విడుదల చేయాలని మైండ్ లో ఫిక్స్ అయ్యారట.నెట్ ఫ్లిక్స్ వాళ్లే ఎక్కువగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఓటీటీ అనే పేరు వింటేనే కోపానికి వచ్చినవారు మళ్ళీ ఎక్కడో ఒక చోట ఆఫర్స్ కు లొంగక తప్పలేదు. అదే తరహాలో మేజర్ టీమ్ దొరక్కపోదా అని ప్రయత్నం చేస్తున్నారట.కాని మహేష్ మాత్రం ససేమీరా అంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: