మహేష్-గుణశేఖర్ కాంబోకి క్రేజ్ ఎలా ఉండేదంటే..?

Suma Kallamadi
2003వ సంవత్సరంలో గుణశేఖర్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రకాష్ రాజు, భూమిక చావ్లా పర్ఫామెన్స్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఒక్కడు సినిమాతోనే మహేష్ బాబుకి విపరీతమైన స్టార్డమ్ లభించింది. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రానికి 8 నంది అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. మహేష్ బాబు, గుణశేఖర్ కాంబో లో వచ్చిన మొట్టమొదటి చిత్రం "ఒక్కడు" టాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఒక్కడు సినిమా తర్వాత మహేష్ బాబు, గుణశేఖర్ కాంబో కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

దీంతో వాళ్ళిద్దరూ కలిసి అర్జున్ సినిమా చేశారు. యాక్షన్ చిత్రంగా వచ్చిన అర్జున్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నటించిన కీర్తి రెడ్డి కి ఫిలింఫేర్ అవార్డు లభించింది. మహేష్ బాబు కి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. అయితే గుణశేఖర్, మహేష్ బాబు కాంబోలో రెండో మూవీ గా వచ్చిన అర్జున్ సినిమా కూడా హిట్ కావడంతో వీళ్ళిద్దరూ కలిసి మరొక సినిమా తెరకెక్కించారు. 2006వ సంవత్సరంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సైనికుడు సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా మహేష్ బాబు హీరోగా నటించారు.

అయితే అప్పటికే మహేష్ బాబు పోకిరి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. దీంతో అతని తారాగణం లో వచ్చే తదుపరి సినిమా అనగా సైనికుడు పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సైనికుడు సినిమా కథ మామూలుగా ఉండటంతో.. ప్రేక్షకుల పెదవి విరిచారు. ఫలితంగా సైనికుడు సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ప్రేమ, రాజకీయం వంటి రెండు అంశాలను సమాంతరంగా చూపించాలని గుణశేఖర్ ప్రయత్నించారు. సైనికుడు సినిమా మంచి ఇంట్రడక్షన్ తో ప్రారంభమైంది కానీ ఆ తర్వాత సన్నివేశాలు చిరాకు తెప్పించాయి. దీనివల్ల వీరిద్దరి కాంబోలో వచ్చిన సైనికుడు సినిమా ఫ్లాప్ అయింది.

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన త్రిష నటించగా.. హరీస్ జైరాజ్ సంగీతం అందించారు. ఆయన స్వరపరిచిన ఓరుగల్లుకే పిల్ల, సొగసు చూడతరమా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ డిజైనర్ గా వ్యవహరించిన రాణా కి నంది అవార్డు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: