30 రోజుల కోసం స్టార్ హీరోకి 8 కోట్ల పారితోషికం...?
కథ నచ్చాలే కానీ కొత్త దర్శకులకు కూడా పిలిచి అవకాశం ఇచ్చే హీరోలలో రవితేజ కూడా ఒకరు. ఇప్పటికే పలువురు నూతన దర్శకులకు అవకాశం ఇచ్చిన ఆయన తాజాగా మరోసారి కొత్త డైరెక్టర్ తో పని చేయబోతున్నారు. శరత్ మండవ అనే నూతన దర్శకుడు రవితేజను డైరెక్ట్ చేయబోతున్నాడు. 'విరాటపర్వం' ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిజ జీవిత సంఘటనలను ఆధారం చేసుకుని యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోందని ఫిల్మ్నగర్ టాక్. అయితే రవితేజ ఈ సినిమాను కేవలం 30 రోజుల్లోనే ఫినిష్ చేయాలని డెడ్ లైన్ పెట్టారట.
అంతే కాదు క్రాక్ సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకున్న రవితేజ ఈ సినిమాకు ఏకంగా 8 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేశాడట. అయితే ఇవన్నీ ఓకే అయ్యి ప్రస్తుతం షూటింగ్ మొదలు పెట్టే పనిలో బిజీ అయిందట చిత్రబృందం. ఈ చిత్రంలో 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా రవితేజతో ఆడిపాడనుంది. ఇదిలా ఉండగా... ఈ మాస్ హీరో తాజా చిత్రం ‘ఖిలాడి' మే 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రవితేజకు మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఆకాంక్షిస్తున్నారు అభిమానుల.