మేజర్ తో అడివి శేష్ పక్కా పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం....

Purushottham Vinay
దేశం గర్వించదగ్గ సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన సినిమా ఇప్పుడు రాబోతుంది.26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మేజర్'. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ మేజర్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న 'మేజర్' చిత్రం జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ చిత్ర తెలుగు టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు, హిందీ వెర్షన్ టీజర్‌ను సల్మాన్‌ఖాన్‌, మళయాల టీజర్‌ను హీరో పృథ్విరాజ్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు.



ఇక ఈ సినిమా టీజర్ ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. టీజర్ ని చూస్తుంటే పక్కా హాలీవుడ్ లెవెల్ లో ఉంది. ఇందులో అడివి శేష్ లుక్ అయితే అతను చెప్పిన డైలాగులు అయితే చూసే ప్రతి ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ మేకింగ్ సూపర్ వుంది. టీజర్ ని చూస్తుంటే చాలు సినిమా పక్కా మాస్టర్ పీస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. ఇక అడివి శేష్ ఈ సినిమాతో గొప్ప పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం లా కనిపిస్తుంది.చూడాలి ఇక ఈ సినిమాతో అడివి శేష్ ఏ రేంజ్ కి వెళ్తాడో.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: