'ఆదిపురుష్' పై డైరెక్టర్ కామెంట్స్...!
ఆది పురుష్ మూవీ షూటింగ్ ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చక్కగా ఆహ్లాదకరంగా జరుగుతోందని, అందరూ ఎంతో ఆనందంగా, ఎనర్జిటిక్ గా షూటింగులో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. షూటింగ్ అనుకున్న విధంగానే సవ్యంగా సాగుతున్నట్లు తెలిపారు. అత్యధిక టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాపై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదట్లో ఈ చిత్రంలో సీత పాత్ర కోసం పలు కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ అందరూ ఊహించిన విధంగా కృతిసనన్ ఆ పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.