'ఆదిపురుష్' పై డైరెక్టర్ కామెంట్స్...!

VAMSI
ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న  చిత్రం "ఆది పురుష్". బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్  ఈ మహా భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్పెషల్ గా చేయించిన సెట్ లో నిర్విరామంగా కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటి వారం వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటుగా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా పూర్తి చేయనున్నారని సమాచారం. కాగా ఈ సినిమా షూటింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు డైరెక్టర్ ఓం రౌత్. ఇటీవల ఓ డైలీతో మాట్లాడిన ఈయన ఆది పురుష్ సినిమా అప్ డేట్స్ ను అందించారు.

ఆది పురుష్ మూవీ షూటింగ్ ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చక్కగా ఆహ్లాదకరంగా జరుగుతోందని,  అందరూ ఎంతో ఆనందంగా, ఎనర్జిటిక్ గా షూటింగులో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు.  షూటింగ్ అనుకున్న విధంగానే సవ్యంగా సాగుతున్నట్లు తెలిపారు. అత్యధిక  టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాపై  తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదట్లో ఈ చిత్రంలో సీత పాత్ర కోసం పలు కథానాయికల  పేర్లు వినిపించినప్పటికీ అందరూ ఊహించిన విధంగా కృతిసనన్ ఆ పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: