శాకుంతలం కోసం పారితోషికం తగ్గించుకున్నందుకు సమంతని పొగడ్తలతో ముంచెత్తుతున్న అభిమానులు...
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం సమంత రూ.2.50 కోట్లు తీసుకుందట. నిజానికి ఆమె యాభై లక్షలు తగ్గించి రెమ్యునరేషన్ తీసున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సమంత-నందిని రెడ్డి కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం.. ఈ స్టార్ హీరోయిన్ రూ.3 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేసింది.అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్ కూడా తీసుకుంది. 2022లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది.ఈ కథ తనకు చాలా నచ్చడంతో పైగా గుణశేఖర్ ప్లాపుల్లో వున్నాడని అర్ధం చేసుకోని సమంత ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకుందట. రెమ్యూనరేషన్ తగ్గించుకున్నందుకు గాను సమంత ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సమంతని పొగడ్తలతో ముంచెత్తుతున్నారట.ఎందుకంటే ఛాన్స్ దొరికితే రెమ్యూనరేషన్ పెంచేస్తున్న ఈ రోజుల్లో సమంత ఒక అడుగు వెనకేసి పారితోషికం తగ్గించుకోవడం గ్రేట్ అని అభిమానులు అభినందిస్తున్నారు.