ఫైనల్ గా నితిన్ చెక్ సినిమా ఎంత వసూళ్లు రాబట్టిందంటే...

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యూత్ స్టార్ గా ఎదిగాడు. తన కెరీర్ లో హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువగా ఎదురుకున్నాడు నితిన్.యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా గతేడాది "భీష్మ" సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో 'భవ్య క్రియేషన్స్' బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా'చెక్‌'. గతంలో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అలరించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నేషనల్ క్రష్ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం… ఫిబ్రవరి 26న విడుదలైంది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి…పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ… దానిని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది 'చెక్'.చెప్పాలంటే మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ ఆ తరువాత నుండీ డౌన్ అవుతూ వచ్చింది.చివరిగా  నితిన్ కెరీర్ లో మరో ప్లాప్ గా మిగిలింది ఈ సినిమా.

ఇక ఈ సినిమా ఇప్పటిదాకా ఎంత వసూళ్లు రాబట్టిందంటే..'చెక్' సినిమాకి రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 9.43 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు 7.17కోట్ల నష్టాలను మిగిల్చిందని చెప్పాలి. మరి 'రంగ్ దే' చిత్రంతో అయినా నితిన్ హిట్ కొడతాడేమో చూడాలి.పాటలు పరంగా మంచి రెస్పాన్స్ దక్కించుకున్న రంగ్ దే మంచి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. వరుస ప్లాపులతో సతమతమవుతున్న నితిన్ ఈ సినిమాతోనైనా సరైన హిట్స్ అందుకుంటాడో లేదో చూడాలి.ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: