ఆర్ఎక్స్ 100 మూవీ తో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ గుమ్మకొండ, తొలి సినిమా ద్వారానే సూపర్ హిట్ అందుకుని తెలుగు ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ దక్కించుకున్నారు. పాయల్ రాజపుత్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ గా నిలిచి యూనిట్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది.దాని తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ కొనసాగుతున్న కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ సినిమా చావు కబురు చల్లగా. లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్, ధియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు ఎమోషన్స్ తో కూడిన కథాకథనాలతో దర్శకుడు కౌశిక్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకుని కార్తికేయ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఎంతో వైభవంగా జరిగింది. కాగా ఈ వేడుకకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలియచేసారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి ఎంతో గ్రౌండ్ లెవల్ లో నిర్మించిన ఈ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే నేడు జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బన్నీ రావడం ఒక రకంగా ఈ సినిమాకి మంచి హెల్ప్ అవుతుందని, తప్పకుండా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా విజయవంతం అవడం ఖాయమని అంటున్నారు పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్. కాగా ఈ సినిమా ఈ నెల 19వ తేదీన గ్రౌండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. మరి ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చావుకబురు చల్లగా సినిమా ఏ స్థాయి సక్సెస్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరొక వారం వరకు వెయిట్ చేయక తప్పదు.....!!