అభిమానులకి షాక్ ఇవ్వబోతున్న సమంత...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా 11 ఏళ్ల నుంచి తన సత్తా చాటింది. దాదాపుగా ఈమె నటించిన సినిమాలన్ని హిట్ గా నిలిచాయి. ఇండస్ట్రీ లో సమంత అంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరు లేరనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. తన నటనతో ఇంకా గ్లామర్ ఎన్నో కోట్ల అభిమానులని సంపాదించుకుంది సమంత.ఈ మధ్యన వరుసగా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటూ వస్తున్న సమంత 'రంగస్థలం' 'ఓ బేబీ' వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. గతేడాది 'జాను' చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇక 'ఫ్యామిలీ మెన్2' వెబ్ సిరీస్ తో ఈ సమ్మర్ కు సందడి చేయబోతుంది సమంత.


ఇక ఇప్పటిదాకా వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చిన సమంత ఇక నుంచి సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుందా? అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఆమె అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసే వార్తే.. అయినప్పటికీ బ్యాడ్ న్యూస్ అయితే కాదు.ఎందుకంటే..సమంత సినిమాలకు గుడ్ బై చెప్పడంల లేదు..జస్ట్ బ్రేక్ ఇవ్వబోతుంది అంతే..! అది కూడా ఆమె గుణశేఖర్ డైరెక్షన్లో చెయ్యబోతున్న 'శాకుంతలమ్‌' పూర్తయిన తరువాతే.! అయితే ఈ ప్రాజెక్టుకి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తే.. వాటిని రిజెక్ట్ చేసిందట.


అంతేకాదు ఇప్పట్లో కొత్త కథలేవీ ఒప్పుకోను అని తేల్చి చెప్పేసిందట.కోట్లకు కోట్లు పారితోషికాలు ఇస్తామని దర్శకనిర్మాతలు ఈమెను ఒప్పించే ప్రయత్నాలు చేసినా ఈమె ఒప్పుకోలేదట.ఎందుకంటే సమంత కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్టే అందరితోనూ చెబుతుందట. ఈ విషయం పై ఆమె సన్నిహితులను ఆరా తియ్యగా… సమంత మనసు ఇప్పుడు మాతృత్వం వైపు మళ్లినట్టు తెలిపిందని వారు చెప్పుకొచ్చారు.అందుకే. సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇవ్వాలనుకుంటోందని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: