ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మెగాస్టార్ మేనల్లుడు ప్రముఖ
టాలీవుడ్ యంగ్
హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'ఉప్పెన' తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చిన కాని రెండవ రోజు నుంచి
సినిమా ఊపందుకుంది ... ఇక ఈ చిత్రం విడుదలయ్యి 12 రోజులు పూర్తయినా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు.రెండో వారం కూడా ఈ చిత్రం అసాధారణమైన కలెక్షన్లను రాబడుతోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకే ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తుంటాయి. ఇక కృతి శెట్టి
హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. 'మైత్రి
మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి
శంకర్,
సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం
ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ
ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు,
హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి.
ఇక ఉప్పెన
సినిమా 12 రోజుల వసూళ్ల విషయానికి వస్తే 'ఉప్పెన' చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్
బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసిన ఈ చిత్రం .. 12 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 45.78 కోట్ల షేర్ ను రాబట్టి స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.దీంతో డబుల్
బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది.ఈ చిత్రం కొన్న బయ్యర్లు రెండింతల లాభాలను ఆర్జించారు. రెండో మంగళవారం నాడు కూడా 0.82 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ చిత్రం.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన
మూవీ అప్ డేట్స్ కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....