బరువు తగ్గనున్న బాపు బొమ్మ...ఆ అవకాశం కోసమేనా...?

VAMSI
టాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న మరో హీరోయిన్. హిందీలో అజయ్ దేవగన్ పక్కన హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిన ఆ బ్యూటీ ఎవరంటే..కె ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెర కెక్కిన "ఏం పిల్లో ఏం పిల్లడో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల నటి ప్రణీత సుభాష్. ఈ సినిమాలో హీరో తనీష్ తో జత కట్టిన ఈ బాపు బొమ్మ మంచి గుర్తింపుని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో బిజీ అయిన ప్రణీత తన అందమైన కళ్ళతో అందర్నీ ఆకర్షించింది. నటిగా మంచి మార్కులే తెచ్చుకున్నప్పటికీ... హీరోయిన్ గా రాణించడానికి మాత్రం కుదరలేదు. దాంతో కోరి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని సెకండ్ హీరోయిన్ గా కంటిన్యూ అయింది.

రభస, అత్తారింటికి దారేది, హలో వంటి ప్రముఖ చిత్రాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలను చేసి ఫస్ట్ హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గకుండా ప్రతిభ కనబరిచింది. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్లిక్ కాలేక పోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. అక్కడ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని ఆకాంక్షించిన ప్రణీతకు ఒక గొప్ప అవకాశం లభించిందట. అజయ్ దేవగన్ హీరోగా నటించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా  సెలెక్ట్ అయ్యారు ప్రణీత. ఈ సినిమాతో హిందీలో వరుస అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోవాలి అనుకుంటున్న ప్రణీత తన లుక్ ను కూడా మార్చేసిందట.

అయితే అది ఆమె చేస్తున్న హిందీ సినిమా కోసమట. ఆ సినిమాలో రెండు పాత్రలను పోషించనున్న ప్రణీత ఓ పాత్ర కోసం తన బరువును భారీగా పెంచుతోందట.... మరి ఇంత ప్రయోగం చేస్తున్న ఈ భామకు బాలీవుడ్ లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి. ఇప్పటి వరకు హీరోయిన్లు బాలీవుడ్ లో చేసి టాలీవుడ్ కి వచ్చిన వారే ఎక్కువ, కానీ ప్రణీత తెలుగులో చేసిన తరువాత బాలీవుడ్ కి వెళుతోంది మరి అక్కడైనా ఈమె మంచి హీరోయిన్ గా నిలబడుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: