నిర్మాతగా మారుతున్న మెగాస్టార్ కూతురు...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... తెలుగు ఇండస్ట్రీ లో మెగాస్టార్ స్టార్ ఫ్యామిలీ కి మంచి గుర్తింపు వుంది. దాదాపు ఈ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు. చాలా మంది యాక్టర్స్ అయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూతురు కూడా ఇప్పుడు ఇండస్ట్రీ లో అడుగుపెడుతుంది. అయితే నిర్మాతగా... మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ‘షూటౌట్ ఎట్‌ ఆలేరు’తో ఓటీటీలో నిర్మాతగా అడుగుపెట్టింది. ఇప్పుడు సినిమా నిర్మాతగా మారబోతోందని  అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘24 కిస్సెస్‌’, ‘పీఎస్‌వీ గరుడవేగ’, ‘ఎల్‌ 7’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న అదిత్‌ అరుణ్‌ హీరోగా గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఓ సినిమా నిర్మించబోతున్నారట. దీనికి సుస్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ‘షిట్‌ హ్యాపెన్స్‌’ అనే అడల్ట్‌ కామెడీ సిరీస్‌తో ఆకట్టుకున్న ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడట.

ఇక ఇప్పటికే "షిట్ హ్యాపెన్స్"  సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం అందుతుంది. ఫీల్‌ గుడ్‌ డ్రామాగా తెరకెక్కున్న ఈ సినిమాలో హీరో పాత్ర పక్కింటి కుర్రాడిలా ఉంటుందంటున్నారు. కథ బాగా నచ్చడంతో సుస్మిత… ఫైనల్‌ డెసిషన్  కోసం తండ్రి చిరంజీవి ని అడిగిందట. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో సినిమా ఫైనల్‌ అయ్యిందని సమాచారం. ఆ తర్వాత సత్యానంద్‌ దగ్గరకు కథ తీసుకెళ్లడం, ఆయన మార్పులు చేసి ఇవ్వడం కూడా జరిగిపోయిందని సమాచారం అందింది.


ఇక ఈ సినిమాని అన్ని విధాలుగా అనుకున్నట్లుగా రెడీ చేసి ఫిబ్రవరి నుంచి తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఫ్యాషన్‌ డిజైనర్‌గా సినిమాల్లో తనేంటో నిరూపించుకున్న సుస్మిత నిర్మాతగా ఎంతగా రాణిస్తుందో చూడాలి. అన్నట్లు క్రిస్‌మస్‌ సందర్భంగా ‘షూట్‌ ఔట్‌…’ సిరీస్‌ జీ5లో ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే.మరి చూసేందుకు రెడీ అవ్వండి మరీ.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: