సౌందర్య కు రీప్లేస్మెంట్ ఎవరు .... బాలయ్య అంత రిస్క్ చేస్తారా ... ??

GVK Writings
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా తాతమ్మకల సినిమా ద్వారా నటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన బాలకృష్ణ అనతికాలంలోనే తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ కు తగ్గ తనయుడిగా వాటితో బ్లాక్బస్టర్ విజయాలను అందుకుని ఎందరో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా గొప్ప స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక తన కెరీర్ లో ఎన్నో గొప్ప విజయాలు అందుకున్న బాలకృష్ణ తొలిసారిగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన సినిమా నర్తనశాల. 2004లో దివంగత నటి సౌందర్య ద్రౌపది పాత్రలో బాలయ్య అర్జునుడిగా, శరత్ బాబు దశరథుడి గా, శ్రీహరి భీముడు గా ఎంతో గ్రాండ్ లెవల్లో ఎన్.బి.కె ఎల్ ఎల్ పి సినిమా బ్యానర్ ఈ సినిమాని మొదలెట్టారు. అయితే ఆ తర్వాత కొంత షూటింగ్ అనంతరం సౌందర్య హఠాన్మరణంతో దీని షూటింగ్ ఒక్కసారిగా నిలిచిపోయింది.
ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఆ సినిమాని అలాగే ఆపేసారు బాలకృష్ణ. అయితే ఇటీవల ఎట్టకేలకు దసరా పండుగ కానుకగా అప్పట్లో ఆ సినిమాకు సంబంధించి చిత్రీకరించిన టువంటి 17 నిమిషాల నిడివిగల ఫుటేజ్ ని ప్రత్యేకంగా ప్రముఖ ఓటిటి మాధ్యమం శ్రేయాస్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు బాలకృష్ణ. కాగా ప్రస్తుతం ఆ సినిమా మంచి ఆదరణతో కొనసాగుతోంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం మేము రిలీజ్ చేసిన నర్తనశాల సినిమా కు ప్రేక్షకాభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని, అన్ని అనుకున్నట్లు జరిగితే అది త్వరలో ఈ సినిమాని పూర్తి స్థాయిలో ప్రారంభించి తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు బాలకృష్ణ.
అయితే ఆయన చెబుతున్న ప్రకారం ప్రస్తుతం ఆ సినిమాలోని ఇతర పాత్రలకు వేరే ఎవరైనా నటుల్ని తీసుకోవచ్చు కానీ ముఖ్యమైన ద్రౌపది పాత్రకు సౌందర్య స్థానంలో రీప్లేస్మెంట్ గా ఎవరున్నారు అనేటువంటి వాదనను తెరమీదకు తీసుకు వస్తున్నారు కొందరు. అయితే ఇప్పట్లో అనుష్క, కీర్తి సురేష్ వంటి దిగ్గజ నటీమణులు ఉన్నప్పటికీ కూడా అటువంటి వారిని బాలయ్య ద్రౌపదిగా తీసుకుంటారా లేక మరెవరైనా నటిని ఎంపిక చేసుకుంటారా అనేటువంటి పూర్తి విషయాలకు సంబంధించిన సమాచారం బయటకు రావాలి అంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు అని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: