ఖలేజా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ట్వీట్ చేసిన మహేష్ బాబు...

Purushottham Vinay
మహేష్ బాబు కెరీర్లో కొన్ని సినిమాలు ఎందుకు డిజాస్టర్లు అయ్యాయో అర్ధం కాదు అని చాలా మంది చెబుతుంటారు. అందులో ‘ఖలేజా’ ‘ 1 నేనొక్కడినే’ సినిమాలు ప్రప్రదమంగా కనిపిస్తాయి. ‘ఖలేజా’ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో మహేష్, త్రివిక్రమ్ మళ్ళీ కలిసి సినిమా చెయ్యలేదు. ఈ రోజు తో ఖలేజా రిలీజ్ అయ్యి పది సంవత్సరాలు అవుతుంది. ఆ తరువాత మహేష్ కొన్ని ప్రయోగాలు చేసినా త్రివిక్రమ్ మాత్రం పూర్తిగా రొటీన్ టెంప్లేట్ సినిమాలు తీస్తూ సేఫ్ గేమ్ ఆడిస్తున్నాడు. జనాలు ఈ చిత్రాన్ని థియేటర్లలో ఆదరించలేదు. కానీ టీవీల్లో మాత్రం ఇప్పటికీ ఆదరిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందా అని కామెంట్లు కూడా చేస్తుంటారు కొందరు నెటిజన్లు.
ఇప్పటికీ ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆదరిస్తుంది. సినిమా అంతా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఇక నేపధ్య సంగీతం అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. మణి శర్మ కంపోజ్ చేసిన మ్యూజిక్ అయితే ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది. సదాశివ సన్యాసి సాంగ్ అయితే ఇప్పటికీ ఎంతగానో శ్రోతులని ఆకట్టుకుంటుంది.
ఖలేజా రిలీజ్ అయ్యి పది సంవత్సరాలు అయినందువల్ల మహేష్ ట్విట్టర్ సినిమా గురించి ట్వీట్ చేసి ఒక వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


ఇక సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ పెట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి మూడవ సారి సినిమా చేయబోతున్నాడని సమాచారం.. ఈ కాంబినేషన్ కి సంబంధించిన విశేషాలు తొందర్లో వెల్లడవబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: