డ్రగ్స్ కేసులో హీరోయిన్ల పై వస్తున్న వార్తలకు తీవ్రంగా మండిపడిపోతున్న నగ్మా...

frame డ్రగ్స్ కేసులో హీరోయిన్ల పై వస్తున్న వార్తలకు తీవ్రంగా మండిపడిపోతున్న నగ్మా...

Purushottham Vinay
బాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు చాలా సీరియస్ గా నడుస్తుంది. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాలు చూసినట్లయితే బాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత జూన్ లో ఆత్మ హత్య చేసుకున్నప్పుడు నేపోటిజం కారణంగా సూసైడ్ చేసుకున్నాడు అనే దానిపై బాలీవుడ్ లో తీవ్రంగా చర్చ నడిచింది. ఇప్పుడు ఆ ఇష్యూ పోయి డ్రగ్స్ వ్యవహారం బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు అతని కేసుని పూర్తిగా మరిచిపోయి అది పక్కన పెట్టేసి… ఆ డ్రగ్స్ కేసులో నిందితులైన హీరోయిన్ల కోసమే ఎన్.సి.బి(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్  గర్ల్ ఫ్రెండ్ మరియు బాలీవుడ్ హీరోయిన్ అయిన రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..

దీపికా పడుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, దియా, నమ్రత శిరోద్కర్ వంటి వారు కూడా ఈ రాకెట్లో ఉన్నట్టు నేషనల్ మీడియాలో కథనాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ వార్తల పై సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మా మండిపడింది. ఆమె మాట్లాడుతూ.. “గతంలో నేను కూడా డ్రగ్స్‌ వాడానంటూ హీరోయిన్‌ కంగనా రనౌత్ డైరెక్ట్ గా చెప్పింది.. మరి ఆమెకు అధికారులు ఎందుకు నోటీసులు పంపలేదు.? కేవలం వాట్సప్‌ మెసేజ్‌లను ఆధారంగా చేసుకుని హీరోయిన్లకు నోటీసులు పంపిస్తున్నారు,మరి కంగనా డైరెక్ట్ గా ఒప్పుకున్నా ఆమెకు ఎందుకు నోటీసులు పంపలేదు.డ్రగ్స్ కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో హీరోయిన్లకు సంబంధం ఉన్నా లేకపోయినా నేషనల్ మీడియాలో వారి గురించి వార్తలు వచ్చేలా చేసి వారి పరువు తీయడమే ఎన్.సి.బి అధికారుల ఉద్యోగమా? ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు” అంటూ నగ్మా పెద్ద ఎత్తున మండిపడింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ పై పలువురు నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: