ఆ ముగ్గురిలో పవన్ ఓటు ఎవరికి..?
అందులో ఒకరు త్రివిక్రం కాగా.. మరొకరు సుకుమార్.. మూడవ డైరక్టర్ సురేందర్ రెడ్డి. త్రివిక్రం తన ప్రతి కథను పవర్ స్టార్ కోసమే రాస్తాడని తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా ఎప్పుడు అంచనాలను మించి ఉంటుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో ఈ ఇద్దరు సూపర్ హిట్ అందుకోగా హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది. అయితే మరోసారి త్రివిక్రంతో పవన్ సినిమా ఉంటుందని టాక్.
ఇక రంగస్థలం సినిమా దర్శకుడు సుకుమార్ తో కూడా పవన్ సినిమా ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు మెగా డైరక్టర్ గా ముద్ర వేసుకున్న సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో రేసు గుర్రం, రాం చరణ్ తో ధృవ, చిరుతో సైరా సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి ఈసారి పవన్ ను డైరెక్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ముగ్గురిలో పవన్ ఎవరికి ఓటు వేస్తాడన్నది తెలియాల్సి ఉంది.