జోరు సెయ్యాలే ?

Satya

పూజా హెగ్డే. రష్మిక ఇపుడు టాలీవుడ్లో ఇద్దరే ఇద్దరు. ఈ ఇద్దరూ ఫ్రెష్ గా అంటే సంక్రాంతికి రెండు హిట్లు కొట్ట తమ ఖాతాలో వేసుకున్నారు. అల వైకుంఠపురంలో పూజా  టాప్ రేంజి హిట్ కొడితే, సరిలేరు నీకెవ్వరు అంటూ మహేష్ పక్కన చిందులేసి రష్మిక తన సత్తా చాటింది. ఆ తరువాత రష్మిక నితిన్ తో భీష్మ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇపుడు ఈ ఇద్దరు హీరోయిన్లు ఒక లెక్కన  దూసుకుపోతున్నారు.

ఇద్దరి చేతిలో చేరి మూడు సినిమాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ తన డిమాండును బాగా సొమ్ము చేసుకుంటున్నారు. స్టార్ హీరోలకు మంచి చాయిస్ గా వీరే ఉన్నారు. పూజా హెగ్డే ఇపుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ మూవీ రాధేశ్యాం లో నటిస్తోంది. ఈ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇది కాకుండా జూనియర్ ఎన్టీయార్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ సినిమా అయినను పోయిరావలె హస్తినకు మూవీలో నటిస్తోంది.

ఇక మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు పూజా చేతిలో ఉన్నాయి. అదే విధంగా రష్మిక విషయం తీసుకుంటే అల వైకుంఠపురంతో అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ పుష్పలో నటిస్తోంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో రష్మిక ఆశలు రెట్టింపు అవుతున్నాయి.

 

ఇదే వూపులో మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను పట్టేసిందిట. ఇక మీదట కేవలం స్టార్ హీరోల పక్కన మాత్రమే నటించాలని రష్మిక ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. ఇలా పూజా, రష్మిక ఈ ఇద్దరూ లేని సినిమాలు ఇపుడు కనిపించే చాన్సే లేదు అంటున్నారు. మరి చూడాలి ఈ ఇద్దరు మరెన్ని హిట్లు కొడతారో. జోరుగా పోటీ పడుతున్న ఈ ముద్దు గుమ్మలకు ఆఫర్లు కూడా వెల్లువలా వస్తున్నాయి కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: