మహేష్ తో ఉపేంద్ర సాన్నిహిత్యానికి చెక్ పెడుతున్న అరవింద్ స్వామి !

Seetha Sailaja

మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీకి విలన్ గా నిన్న మొన్నటివరకు వినిపించిన కన్నడ స్టార్ ఉపేంద్ర స్థానం తమిళ హీరో అరవింద్ స్వామిని తీసుకురావడం వెనుక మహేష్ అభిమానుల అభిప్రాయాలు కీలపాత్ర పోషించాయి అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఉపేంద్ర ఈమూవీలో విలన్ పాత్రకు ఎంపిక అయినట్లుగా లీకులు ప్రారంభం అయిన దగ్గర నుండి మహేష్ అభిమానులు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు.


దీనికికారణం ఉపేంద్ర విలన్ పాత్రకు పెద్దగా సూట్ అవ్వడని వేల కోట్లల్లో అప్పులు చేసి ప్రభుత్వాలతో ఒక ఆట ఆడుకునే పొగరుబోతు విలన్ పాత్రకు ఉపేంద్ర ఎంపిక ఏమాత్రం బాగుండదని మహేష్ అభిమానుల అభిప్రాయం. అందువల్ల స్టైలిష్ విలనిజం చూపించి అందర్నీ ఆకట్టుకునే విలన్ గా పేరున్న  అరవింద్ స్వామిని ఎంపికచేయమని అంటూ మహేష్ అభిమానులు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.


ఇప్పుడు ఈకామెంట్స్ అన్నీ మహేష్ పిఆర్ టీమ్ ద్వారా నమ్రత దృష్టికి రావడంతో ఎలర్ట్ అయిన నమ్రత పరుశు రామ్ తో మాట్లాడి ఉపేంద్ర స్థానంలో అరవింద్ స్వామిని ఎంపిక చేసేలా రాయబారాలు చేస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల రీత్యా మహేష్ తన పారితోషిక విషయంలో ఒక మెట్టు దిగినట్లుగా వార్తలు రావడంతో మారుతున్న పరిస్థితులకు మహేష్ లాంటి టాప్ హీరో కూడ రాజీపడిపోయాడు అన్నకామెంట్స్ వస్తున్నాయి.

 
మహేష్ ఇప్పటివరకు తన సినిమాలకు సంబంధించి నాన్ ధియేట్రికల్ రైట్స్ ను పారితోషికంగా తీసుకోవడం ఒకపద్దతిగా పెట్టుకోవడంతో ఇప్పటివరకు మహేష్ లేటెస్ట్ సినిమాలకు సంబంధించి 45 నుంచి 50 కోట్ల వరకు ఆదాయాన్ని తన పారితోషికంగా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు కరోనా తో పూర్తిగా పరిస్థితులు మారిపోవడంతో ఈసినిమాకు సంబంధించిన టోటల్ బిజినెస్ లో ఈసినిమా ప్రొడక్షన్ కాష్ట్ ను మినహాయించి తన పారితోషికంగా 40 శాతం వాటా మాత్రమే తీసుకుంటాను అని నిర్మాతలకు భరోసా ఇవ్వడంతో మహేష్ కు ఈసినిమాకు సంబంధించి పారితోషికంగా ప్రస్తుత పరిస్థుతులలో 35 కోట్ల షేర్ మాత్రమే పారితోషికంగా వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో టాప్ హీరోలలో పరిస్తుతులతో రాజీపడిన మొదటి హీరోగా మహేష్ తన మంచి మనసు చాటుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: