మళ్లీ వస్తున్న లతాశ్రీ

Prasad
యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటి అడక్కు.. వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లతాశ్రీ. అభినయం తోపాటు అందాల ఆరబోతకు మంచి పేరు తెచ్చుకున్న లతాశ్రీ కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే మళ్లీ ప్రేక్షకుల ముందుకు లతా శ్రీ రానుంది. బుల్లి తెర మీద లతాశ్రీ కనిపించనుంది. ‘సూపర్ మామ్’ పేరుతో జీ తెలుగులో ప్రసారం కానున్న కార్యక్రమంలో లతాశ్రీ పాల్గొంటుంది. లతాశ్రీ తో పాటు పది మంది సెలెబ్రిటీ మామ్స్ తమ పిల్లలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బుల్లి తెర అగ్రహీరో ప్రభాకర్, తన కూతురుతో కలిసి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: