హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2010-2020: దశాబ్దపు భారీ కాదు భీభత్స బడ్జెట్ సినిమాలివే
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సైరా’. రామ్ చరణ్ కొణిదల బ్యానర్ పై రూ.250 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం విడుదలై కథ పరంగా ఓకే అనిపించుకుంది కానీ ఆశించినంత కలెక్షన్లు రాబట్టలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’.మే9న ప్రేక్షకుల ముందుకు వచ్చి. పర్వలేదనిపించుకుంది. ఇక బాలీవుడ్, మాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాలు ‘కళంక్’, ‘బహ్మాస్త్ర’, ‘మరక్కర్’(మలయాళం) ఇవి కూడా భారీ బడ్జెట్తో రూపొందుతున్నాయి. ‘బ్రహ్మస్త్ర’లో అమితాబచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, ఆలియా భట్ వంటి నటులు నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లు. 2020లో విడుదల కాబోతోంది. కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట సినిమా ‘కళంక్’. అభిషేక్ వర్మన్ దర్శకుడు. ఇందులో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యరాయ్ కపూర్ తదితరులు నటించారు. ఇక మాలీవుడ్లో రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమా ‘మరక్కర్’. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో మోహన్లాల్, సునీల్ శెట్టి, అర్జున్షారా, సిద్దిఖి, ప్రభుదేవా, సుదీప్లు నటిస్తున్నారు. రూ.100కోట్ల బడ్జెట్తో రూపొందుతోంది. 2020లో విడుదల కాబోతోంది. అలాగే కేజీఎఫ్ కూడా భారీ బడ్జెట్ సినిమానే అయితే విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. అలాగే అనుకున్న బడ్జెట్ కూడా రాబట్టుకుంది. అలాగే పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం కథ పరంగా పెద్దగా హిట్ కాలేకపోయినా కలెక్షన్లు పరంగా భారీగానే రాబట్టుకుంది.