ఖైదీ సినిమాపై మహేష్ అభిప్రాయం

Suma Kallamadi
తాజాగా కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖైదీ. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మారథం పట్టారు. ఇక కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాకు మంచి టాక్‌ రావటంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఖైదీ టీంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అంటే నమ్మండి.


ఇటీవల ఈ సినిమాపై సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు స్పందిచాడు. శుక్రవారం సినిమా చూసిన మహేష్‌ తన  ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్నిఅభిమానులతో పంచు కోవడం జరిగింది. ఖైదీ టీంకు శుభాకాంక్షలు చెప్పుతూ ట్వీట్ చేసిన మహేష్. `ఖైదీ.. న్యూ ఏజ్‌ ఫిలిం మేకింగ్. గ్రిప్పింగ్‌ స్క్రిప్ట్‌లో అద్భుతమైన నటన, థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా బాగా సెట్ అయ్యాయి. పాటలు లేకపోవటంతో ఓ కొత్త సాంప్రదాయానికి స్వాగతం పలికాయి. ఖైదీ టీం అందరికీ శుభాకాంక్షలు` తెలియచేయడం జరిగింది.


మహేష్‌ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో చాల బిజీగా ఉన్నాడు. దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా ఏళ్ల తరువాత ఈ సినిమాతో విజయ శాంతి రీ ఎంట్రీ ఇస్తుండంతో ఈ సినిమాపై భారీగా  అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీ కరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 సంక్రాంతి పండుగ సందర్బంగా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక సినిమా విషయానికి వస్తే మానగరం ఫేం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమాలో కార్తి, హరీష్ ఉత్తమన్‌, నరైన్ కుమార్, ధీన, జార్జ్ మర్యా్న్‌లు కీలక పాత్రల్లో నటించడం జరిగింది. పదేళ్ల శిక్ష తరువాత జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ తన కూతురిని చూసేందుకు పడే తాపత్రేయం.. ఆ ప్రయాణంలో ఓ ఖైదీ వందల మందితో పోరాడాల్సి రావటంతో అనే విభిన్న కథతో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. కేవలం ఓ రాత్రి నాలుగు గంటల వ్యవధిలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మహేష్ బాబుతో పాటు మెగా డాటర్‌ నిహారిక కూడా ఖైదీ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: