జగన్ మ్యానియాకు భయపడిపోతున్న సైరా సాహో లు !

Seetha Sailaja
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల జోరుతో ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా జగన్ వార్తలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో కూడ సినిమాల విషయాల కంటే జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పై ఎక్కువ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

ఈ పరిస్థుతులకుతోడు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాల రిలీజ్ హడావిడి లేదు. మళ్ళీ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాల హడావిడి ఆగష్టు నుంచి మాత్రమే ప్రారంభం కాబోతోంది. ఆగష్టు 15న ‘సాహో’ విడుదల ఆతుంటే అక్టోబర్ 2న ‘సైరా’ విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. 

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మోస్ట్ ఎవైటెడ్ మూవీలుగా ఎదురు చూస్తున్న ఈ రెండు సినిమాల బడ్జెట్ 600 దాటిపోవడమే కాకుండా ఈ రెండు సినిమాల బిజినెస్ సుమారు 1000 కోట్ల వరకు జరిగే ఆస్కారం కనిపిస్తోంది. దీనితో ఈ రెండు సినిమాలలో ఎదో ఒకటి ‘బాహుబలి’ రికార్డును బ్రేక్ చేస్తుంది అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి.

దీనితో ఈ రెండు సినిమాలు విడుదల అయ్యేదాకా మరియే పెద్ద సినిమా హడావిడి ఇండస్ట్రీలో ఉండదు. ఈమధ్యలో జూలైలో ‘డియర్ కామ్రేడ్’ వస్తున్నా దాని స్థాయి ప్రభాస్ చిరంజీవిలతో సమానం కాదు. ఇలాంటి పరిస్థుతులలో ‘సాహో’ ‘సైరా’ విడుదల అయ్యేదాకా మీడియాలో ఇండస్ట్రీ వర్గాలలో కేవలం జగన్ వార్తలే కనిపిస్తాయి అనీ ఒకవేళ ఆ రెండు సినిమాలు విడుదల అయ్యాక కూడ జగన్ మ్యానియా కొనసాగినా ఆశ్చర్యం లేదు అంటూ ఇండస్ట్రీ ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ ను బట్టి ప్రస్తుతం జగన్ మ్యానియా ఏ రేంజ్ లో కొనసాగుతోందో అర్ధం అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: