దాసరి నారాయణరావు పై సంచలన కామెంట్స్ చేసిన పోసాని కృష్ణ మురళి..!

KSK
టాలీవుడ్ సీనియర్ రచయిత మరియు సినీనటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా దివంగత దాసరి నారాయణరావు పై సంచలన కామెంట్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణరావు అధ్యయనం ఒక చరిత్ర అంటూ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ..చివరి రోజుల్లో దాసరి నారాయణరావు హాస్పటల్లో ఉన్నప్పుడు పట్టించుకున్న నాథుడే లేడని పోసాని కృష్ణ మురళి షాకింగ్ కామెంట్ చేశారు.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని మాట్లాడుతూ...''ఒకానొక సమయంలో దాసరి నారాయణరావు గారు బైపాస్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దానికి అవసరమైన మూడు లక్షలు ఆయన దగ్గర లేకపోవడంతో 'మహావీర్' హాస్పిటల్ లో యాభై వేల రూపాయలతో ఆపరేషన్ చేయించుకున్నారు. కనిపిస్తే ఆయన ఎక్కడ డబ్బులు అడుగుతారోనని పదిమంది కూడా ఆయనను చూడడానికి హాస్పిటల్ కి వెళ్లలేదు'' అంటూ చెప్పుకొచ్చారు.


చలన చిత్ర పరిశ్రమలో మరియు సమాజంలో ఆయన ఎంతో మందికి సహాయం చేశారు అని అంటూ అలాంటి వ్యక్తి చివరిరోజుల్లో చేయి చేపట్టాల్సి వచ్చిందని..ఆ విషయం నేను ఒక జర్నలిస్టు ద్వారా తెలుసుకొని ఆయన క్షేమాన్ని కోరుతూ లక్ష రూపాయలు ఖర్చు చేసి దినపత్రికలో యాడ్స్ ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు పోసాని. అంతేకాకుండా అది చూసిన దాసరి నారాయణ రావు గారు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్ళు పెట్టుకున్నారని చివరి రోజుల్లో ఆయన పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాను అంటూ తీవ్ర భావోద్వేగానికి గురై దాసరి నారాయణరావు గురించి చెప్పుకొచ్చారు పోసాని కృష్ణమురళి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: